తన్నులు తిని వైసిపి వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాము అని చెప్పడానికి సిగ్గులేదా అంటూ ఏపీ పోలీసులు ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కార్యాలయం ఎదుట విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు.ఒక పోలీస్ పై జరిగిన దారుణమైన దాడి చూస్తుంటే వైసీపీ గూండాలు ఎంత ధైర్యంగా దాడులకు తెగబడుతున్నారో తెలుస్తుంది అంటూ విమర్శించారు.
ఏపీలో పోలీసులకు కూడా రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు.దీనిపై ఏపీ పోలీస్ శాఖ కూడా స్పందించి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది.బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వైసిపి కార్యకర్తలు కిందపడిపోయిన పోలీసును లేవదీసారని గాయాలకు మసాజ్ చేశారని పేర్కొంది.చంద్రబాబు ఇటువంటి తప్పుడు ప్రచారాలు దూరంగా ఉండాలని కోరింది.
అయితే పోలీస్ శాఖ స్పందించిన తీరు పై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీస్ శాఖ గౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ల దగ్గర పెట్టకండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అధికార పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని , వైసిపి గూండాల నుంచి పోలీసులను కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా, కళ్ళకు గంతలు కట్టుకుని ఫాక్ట్ చెక్ చేసుకోవాలి అంటూ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటూ లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసిపి గూండాల నుంచి తోటి పోలీసులనే కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా, కళ్లకు గంతలు కట్టుకున్నారని మండిపడ్డారు.” పోలీసు గాయపడ్డారని మీరే అంటున్నారు మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారు ? ఆయనకి ఆయనే గాయపరచు కున్నడా ? ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు ? బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయమయ్యాయి ? గాయపడిన పోలీస్ కి ఆయింట్మెంట్ పూయడం బాధాకరం.వైకాపా గూండాల దాడి లోనే పోలీస్ గాయపడ్డారు.
వైకాపా నాయకులు పోలీసుల పై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయట పెట్టే ధైర్యం మీకు ఎలాగూ లేదు.అందుకే నేనే విడుదల చేస్తున్న అంటూ లోకేష్ తన ట్విట్టర్ లో విమర్శించారు.