తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ గుంటూరు జిల్లాలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించిడానికి బయలుదేరడం జరిగింది.ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నే తరహాలో గన్నవరం విమానాశ్రయం చుట్టుప్రక్కల మొత్తం పరిస్థితిని అదుపులోకి తీసుకోవటం మాత్రమే కాక టీడీపీ కీలక నేతలని హౌస్ అరెస్ట్ ను కూడా చేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో లోకేష్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అఘాయిత్యాలకు.
అత్యాచారాలకు అడ్రస్ గా మారిందని విమర్శించారు.
గుంటూరు జిల్లాలో వివాహానికి హాజరై రాత్రి బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి.భర్తను చితక్కొట్టి.వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో.
ఈ ఘటనపై.బాధితులు పోలీసు స్టేషన్కు వెళితే అది తమ పరిధిలోకి రాని ప్రాంతమని పోలీసులు తెలపడంపై లోకేష్ సీరియస్ అయ్యారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో చోటు చేసుకున్న ఈ ఘటన పై.మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.కానీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా తాను వెళ్తుంటే దానికి కూడా పోలీసులను రంగంలోకి దింపి అడ్డుకుంటున్నారని.రాష్ట్ర ప్రభుత్వం పై అదే రీతిలో పోలీసులపై తీవ్ర స్థాయిలో లోకేష్ ఫైర్ అయ్యారు.