ఏపీ అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది, ఇక సామాన్య ప్రజల బతుకులు ఇంకా ఎలా అంటూ సోషల్ మీడియాలో నిలదీశారు, లోకేష్ పెట్టిన పోస్ట్ ఈ విధంగా ఉంది.’రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు.పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారి పై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం దారుణం.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని లోకేష్ చెప్పారు.‘శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి?ఎస్ఐ శివశంకర్ గారి పై దాడి చేసిన వైకాపా రౌడీలను కఠినంగా శిక్షించాలి’ అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.