తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక ఆశాకిరణం నారా లోకేష్చంద్రబాబు రాజకీయ వారసుడిగా అరంగ్రేటం చేసిన లోకేష్ ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన టిడిపిలో పట్టు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఆయన పనితీరు మెరుగు పడిందనే చెప్పవచ్చు.టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపలేకపోయారు.
ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా, అందులో తప్పులు దొర్లేవి, అవి లోకేష్ కు ఇబ్బంది గానూ మారాయి.లోకేష్ సమస్యలపై సొంత పార్టీ నేతల్లోనే అనేక అనుమానాలు కలిగేలా చేశాయి.
దీంతో లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ మునిగిపోతుందని, ఆయన చేతుల్లో పార్టీని పెట్టి, టిడిపి భవిష్యత్తును నాశనం చేయవద్దని, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, లేకపోతే పార్టీలోనే ఉన్న సమర్థులైన నాయకులకు ఆ అవకాశం కల్పించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించేది.అయితే ఇప్పుడు లోకేష్ వ్యవహార శైలి చూసిన వారు ఎవరూ ఆ వ్యాఖ్యలు చేయడం లేదు.
ఎందుకంటే గతంతో పోలిస్తే లోకేష్ పనితీరు బాగా మెరుగుపడింది.పంచ్ డైలాగులు పేలుస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.పదేపదే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తను ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తున్న కొడాలి నాని వంటి వారికి అదే కొడాలి నాని భాషలో లోకేష్ విమర్శలు చేస్తున్నారు.
కొడాలి నాని కి కౌంటర్ ఇచ్చే స్థాయిలో లోకేష్ బలపడడం, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మొదట్లో కొడాలి నాని దేవినేని ఉమ వంటి వారు విమర్శలు చేసినా జనాల్లోకి అంతగా వెళ్ళేవి కావు.
అయితే లోకేష్ ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తున్న తీరు, వివిధ ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, చంద్రబాబు స్థాయి వ్యక్తిగా లోకేష్ తన పనితీరును మెరుగు పరుచుకోవడం, ఇప్పుడు పార్టీ నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
రాష్ట్రం లో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశం దొరికినా లోకేష్ వదిలిపెట్టడం లేదు.
తన రాజకీయ ఎదుగుదలకు దాన్ని సక్రమంగా వాడుకుంటూ, భవిష్యత్తులో తెలుగుదేశాన్ని సమర్థవంతంగా తాను నడిపించగలను అనే విషయాన్ని లోకేష్ రుజువు చేసుకుంటున్నారు.