ఇటీవల గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో హత్యాచార ఘటన సంఘటన జరగడం తెలిసిందే.ఈ హత్యాచారానికి గురైన తిరుపతమ్మకు తాజాగా టిడిపి పార్టీ కీలక నేత నారా లోకేష్ 5 లక్షల రూపాయలు సహాయం అందించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల చెక్కును లోకేష్ అందజేయడం జరిగింది.
ఈ విషయాన్ని లోకేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించాను.తిరుపతమ్మ కుమార్తె అఖిల పేరున రూ.3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేసాను, ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా అన్న గా ఆదుకుంటానని హామీ ఇచ్చాను.ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు అని లోకేష్ పేర్కొన్నారు.