ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ వ్యవసాయ రంగం వెన్ను విరిచారని మండిపడ్డారు.
రాయలసీమ రైతులకు గతంలో 90 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇచ్చామని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు.జగన్ అంటేనే మోసం… దగా.వంచనకు ప్రతిరూపం అంటూ విమర్శించారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ మాయలో పడి మోసపోవద్దని సూచించారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.