ఆంధ్రప్రదేశ్లో ఉన్న కియా ప్లాంట్ను తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వచ్చిన ఒక వార్త కథనం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.ఏపీలో ఉన్న పరిస్థితులే కియా ప్లాంట్ తరలింపుకు కారణం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కియా ఇండియా అధికారి ప్లాంట్ తరలింపు నిజం కాదంటూ ప్రకటించగా ప్రభుత్వం కూడా ప్లాంట్ తరలింపుపై వస్తున్న వార్తలు నిజం కాదని, కియాకు కావాల్సిన అన్ని వసతులు మరియు వనరులను సమకూర్చుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా ఈ విషయమై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
కియా తరలింపు కథనాన్ని ట్వీట్ చేసిన ఆయన ఏపీ ప్రజలు చేసిన తప్పేంటి.వారికి ఎందుకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.రాష్ట్రం నుండి కియా వెళ్లి పోతే రాష్ట్ర భవిష్యత్తు ఏంటీ.
రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చావు దెబ్బ అంటూ లోకేష్ అభిప్రాయ పడ్డారు.కియాకు ఆ ఉద్దేశ్యం ఉండటం వల్లే అంతర్జాతీయ మీడియాలో ఈ కథనం వచ్చి ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు.
కియా వెళ్లి పోతే జగన్ ప్రభుత్వంను ఏపీ ప్రజలు క్షమించరు అంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు.