తెలుగుదేశం పార్టీ గురించి , చంద్రబాబు లోకేష్ విషయాలపై నిన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు లోకేష్ కు గట్టిగానే తగిలినట్టు ఉన్నాయి.ముఖ్యంగా జయంతిని వర్ధంతి కి తేడా తెలియని వారు అంటే నేను పడాల అంటూ వంశీ నారా లోకేష్ ను ఉద్దేశించి అనడంపై ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారట.
వంశీ విషయంలో తానెప్పుడు పొరపాటుగా ప్రవర్తించలేదని, ఆయనకు ఎప్పుడూ తగిన గౌరవం ఇచ్చానని లోకేష్ తన సన్నిహితుల వద్ద వాపోయారట.
ఇక వంశీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వకపోతే మరింతగా జనాల్లో పలుచన అవుతామని ఆయనకు పలు సూచనలు అందడంతో ఈరోజు ఆయన స్పందించారు.
గతంలో పార్టీ కార్యకర్తల ఒత్తిడితోనే తాను పార్టీ మారబోతున్నాను అంటూ చెప్పి ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వంశీ తీసుకు వచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా లోకేష్ స్పందించాడు.
అది ఎప్పుడో 2009 వ్యవహారమని ఇప్పుడు మనం 2019లో ఉన్నామని అన్నారు.పార్టీలోకి నాయకులు వస్తారు పోతారని, తెలుగుదేశం మహాసముద్రం లాంటిదని, వంశీ కి ఇంకా హ్యాంగోవర్ తగ్గలేదు అంటూ సెటైర్లు వేశాడు.
తన ఆస్తులను కాపాడుకోవాలని ఒకే ఒక్క కారణంతోనే వంశీ పార్టీ మారుతానంటూ చినబాబు విమర్శలు చేశారు.