ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అప్పుడెప్పుడో ఓ మూవీలో అర్జున్ ఒన్డే సీఎం అయినట్టు.ఇప్పుడు ఏపీకి ఫోర్ డేస్ సీఎమ్మా అని నోరెళ్లబెడుతున్నారా?! ఇది నిజమేనట! అయితే, అధికారికంగా మాత్రం కాదు.అదే ట్విస్టు! రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు.ఈ నెల 10 నుంచి విదేశాలకు వెళ్తున్నారు.ఆ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు.దుబాయ్ సహా అరబ్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులతో భాటీ అయి.ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటన ఈ నెల 10 నుంచి మొత్తం 4 రోజులు జరగనుంది.
సీఎం చంద్రబాబుతో పాటు 15 మంది మంత్రులు కూడా ఈ పర్యటనకు వెళ్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా.ఏపీలో సీఎం బాబు లేనిరోజుల్లో పాలనను ఎవరు నిర్వహిస్తారనే సందేహం సాధారణంగా వస్తుంది.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి చూపూ చినబాబు.
లోకేష్పైకి మళ్లిందట! వాస్తవానికి చంద్రబాబు ఊళ్లో ఉంటేనే ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం ఎక్కువైందని టాక్ ఉంది.మంత్రులు సైతం లోకేష్ జోక్యంపై పలుమార్లు విస్తుబోయారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఊళ్లో లేని సమయంలో నాలుగు రోజుల పాటు లోకేష్ అనధికార సీఎంగా వ్యవహించే అవకాశం లేకపోలేదని పలువురు చెబుతున్నారు.నిజానికి చంద్రబాబే తనకు మారుడికి ఈ ఛాన్స్ పరోక్షంగా కల్పిస్తున్నారనే వారూ ఉండడం గమనార్హం.అంటే… , ఈ నాలుగు రోజులూ ప్రభుత్వ బాధ్యతలు, మంత్రులతో సమావేశాలు వంటివి లోకేష్ ఆధ్వర్యంలోనే అనధికారికంగా ఉంటాయన్నమాట.దీనినిబట్టి లోకేష్ పనితీరును తెలుసుకోవడం కోసమే చంద్రబాబు ఈ నాలుగు రోజులూ తన బాధ్యతల్ని కుమారుడికి అప్పగించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.
.