ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ చిక్కుల్లో పడ్డాడు.అసెంబ్లీ మరియు మండలిల్లో సభ్యులు మొబైల్స్ వినియోగించడం, వాటిలో చిత్రీకరించడం నిషేదం.
చట్ట సభల్లో మొబైల్స్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి.అయినా కూడా నిన్న మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ తన ఫోన్ను తీసి అందులో వీడియోను చిత్రీకరించేందుకు సిద్దం అయ్యాడు.
ఆ సమయంలోనే వైకాపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చైర్మన్ కూడా లోకేష్ తీరును తప్పుబట్టాడు.
చైర్మన్ పోడియంను చుట్టు ముట్టిన మంత్రులు కొందరు చైర్మన్ వద్ద ఉన్న పేపర్లను చించేయడంతో పాటు చైర్మన్ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో తెలుగు దేశం సభ్యులు వైకాపాను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఇరు సభ్యుల మద్య వాగ్వివాదాలు జరిగాయి.ఆ మొత్తం సంఘటనలు మొబైల్లో చిత్రీకరించేందుకు నారా లోకేష్ ప్రయత్నించాడు.సభలో గందరగోళం ఉన్న కారణంగా చైర్మన్ లైవ్ ఆపేయించాడు.
అందుకే లోకేష్ తన మొబైల్లో చిత్రీకరణ చేసినట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు.మండలిలో మొబైల్తో చిత్రీకరించినందుకు గాను లోకేష్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వైకాపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.