టీడీపీని స్థాపించింది నందమూరి తారక రామారావు.ఈ విషయాన్ని ఎవరైనా చెబుతారు.కానీ ఆయన తర్వాత ఆ స్థాయిలో తనయులు రాణించలేకపోయారు.హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.ఇక చంద్రబాబు చాణక్యంతో టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నారు.ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆయనే పార్టీని నడిపిస్తున్నారు.
ఇక ఆయన తర్వాత నారా లోకేష్ ను భావి అధ్యక్షుడిగా ఇప్పటికే ప్రకటించేస్తున్నారు.అయితే చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో రాణించడంలో లోకేష్ నిరాశ పరుస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన నాయకత్వం మీద కూడా అపనమ్మకం మొదలయింది.గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్ ను మంత్రి చేసినా ఆయన మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో తమ్ముళ్లు ఆయన్ను ఓన్ చేసుకోలేకపోతున్నారు.
ఇక వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుండటంతో చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది తమ్ముళ్లలో.దీంతో వారంతా కూడా నందమూరి వారసుల వైపు చూస్తున్నారు.ముఖ్యంగా చంద్రబాబు ముందే చాలామంది కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్నారు.కుప్పంలోనూ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది.
ఆయన పార్టీ పగ్గాలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు కూడా చెబుతున్నారు.కానీ ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఎన్టీఆర్ స్పష్టం చేస్తున్నారు.తాను సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు.కానీ తమ్ముళ్లు మాత్రం తమ ప్రచారాన్ని ఆపట్లేదు.మొదట రాయలసీమలో మొదలైన జూనియర్ ఎన్టీఆర్ ఫీవర్.ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తోంది.
సీనియర్ నేతలు కూడా చంద్రబాబును విమర్శించడంతో ఈ ఫీవర్ పార్టీలో మరింత ఎక్కువయింది.ముఖ్యంగా నారా నైనై.
జూనియర్ జైజై అనే నినదం అన్ని జిల్లాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ బలంగా వినిపిస్తోంది.కానీ జూనియర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు.
మరి ఈ ఫీవర్ను లోకేష్, చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.