నందమూరి బాలకృష్ణ అంటే భయపడే వారున్నారు.అభిమానించే వారు ఉన్నారు.
ఇక ఆయన రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.అభిమానులను కసురుకుని, చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి ఈ మధ్యకాలంలో తన కోపాన్ని భస్మం చేసినట్టు ఉన్నాడు.అదీగాక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మారాలని భావిస్తున్నాడు కావచ్చూ.
అందుకే తన కూతురు అయిన నారా బ్రాహ్మణి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాడు.
ఇకపోతే ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నందమూరి బాలకృష్ణ చైర్మన్ అన్న విషయం తెలిసిందే.
ఇక బోర్డు మెంబర్గా నారా బ్రాహ్మణి కీలక పదవిలో కూర్చోపెట్టారు.ఇక గతంలో కంటే ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్న బాలయ్య బ్రాహ్మణిని బోర్డు మెంబర్ చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక ఒకవైపు సినిమాలు చేస్తూనే తన నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శల పదును పెంచుతున్నారు.
మరి రాజకీయాల్లో క్రియాశీలకం కావాలంటే, క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించిన బాధ్యతలను బ్రాహ్మణి చేతిలో పెట్టి తాను మాత్రం రాజకీయాలు, సినిమాల మీద దృష్టి సారించనున్నట్లు అర్ధం అవుతుంది.