తెలుగు చిత్రసీమకి అతిపెద్ద మార్కేట్ నైజాం.ఏ సినిమా కలెక్షన్లు అయినా, సింహభాగం నైజాం నుంచి రావాల్సిందే.
ఈ నైజాం ఏరియాలో పట్టు ఉండటం వల్లే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాజ్యమేలారు.ఇప్పుడు అదే నైజాం బలంతో మహేష్, పవన్ చక్రం తిప్పుతున్నారు.
ఎన్టీఆర్ సీడెడ్ లో రారాజు, చరణ్ నెల్లూరు , వైజాగ్ లో తోపు, కాని అవి నైజాంతో పోల్చుకుంటే చాలా చిన్న మార్కేట్లు.నైజాంలో బలం ఉంటే రికార్డులు కొట్టడం ఈజి అవుతుంది.
అందుకే ఎన్టీఆర్ నైజాం మీద దృష్టి పెట్టాడు.
బాహుబలిని మినహాయిస్తే, నైజాంలో అత్యధిక స్క్రీన్లలో విడుదలైన చిత్రం 1-నేనొక్కడనే.
అంతకు ముందు ఆ రికార్డు అత్తారింటికి దారేది పేరిట ఉండేది.ఆగడు, శ్రీమంతుడు నైజాంలో రికార్డు రిలీజ్ కాకాపోయినా, ఒపెనింగ్ రికార్డులను బద్దలు కొట్టాయి.
మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు మహేష్ చిత్రాలను ఎగబడి చూస్తారు.
ఇక పవర్ స్టార్ కి కూడా నైజాంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమా టాక్ తో సంబంధం లేకుండా నైజాంని ఒక ఊపు ఊపుతూ ఉంటాడు పవన్.టాక్ తో సంబంధం లేకుండా నైజాంలో మంచి కలెక్షన్లు రాబట్టేది వీరిద్దరే.
నైజాం కాస్త వీక్ గా ఉండటంతో వీరిద్దరి వెనకే ఉండిపోయాడు ఎన్టీఆర్.ఇప్పుడు నాన్నకు ప్రేమతో నైజాంలో తన జెండా ఎగురవేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్.
దానిలో భాగంగానే బాహుబాలి తరువాత నైజాంలో 400 స్క్రీన్లలో విడుదల అవుతున్న రెండో చిత్రంగా నాన్నకు ప్రేమతోని నిలబెడుతున్నాడు.ఒపెనింగ్ రికార్డులు జేబులో వేసుకోని పవన్, మహేష్ లకు తెలంగాణలో చెక్ పెట్టాలనుకుంటున్నాడు.