ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం పై రగులుతున్న చిచ్చు క్రమక్రమంగా రాజుకుంటుంది. ఏపీ బీజేపీ నేతల మాటలు కూడా పట్టించుకోని కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గుచూపుతుందట.
ఈ నేపధ్యంలో ఏపీలోని అధికార పార్టీ కూడా ఈ అంశంపై ఆలోచించాలని కేంద్రానికి ఎంతలా మొరపెట్టుకున్న పెడచెవిన పెడుతూ వస్తుందట మోదీ ప్రభుత్వం.ఈ క్రమంలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్ర బంద్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని, ఆ తర్వాత బస్సులు మామూలుగానే తిరుగుతాయని చెప్పారు.రేపటి బంద్ కు సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇకపోతే ఇప్పటికే విపక్ష టీడీపీ సహా పలు పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి.తాజాగా అధికారపక్షం వైసీపీ కూడా ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది.
మరి ఈ సెగ కేంద్రానికి తాకుతుందో లేదో చూడాలి.