భారీ అంచనాల మధ్య సరికొత్త కథనంతో తెరకెక్కిన నాని ‘మజ్ను’ ఓవర్ సీస్ లో ఈ రోజు రిలీజవుతుండగా ఇండియాలో సెప్టెంబర్ 23 నుండి థియేటర్ లలో సందడి చేయనుంది.సరికొత్త కథలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నాని ‘మజ్ను’ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
‘ఉయ్యాల జంపాల’ లాంటి డీసెంట్ హిట్ ని ఇచ్చిన విరించి వర్మ కొంత గ్యాప్ తీసుకుని మరీ తెరకెక్కించిన సినిమా మజ్ను.‘మజ్ను అంటే లవ్ లో ఫెయిల్ అయి బాధగా ఉండే మజ్ను కాదు.
హ్యాప్పీగా ఉండే మజ్ను’ అని చెప్పుకున్న నాని ఈ సినిమా తప్పకుండా భారీ సక్సెస్ అవుతుందనే ధీమాతో ఉన్నాడు.
ఓవర్ సీస్ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న AZ ఇండియా మీడియా LLC & ATMUS ఎంటర్ టైన్ మెంట్స్ యు.యస్ లోని లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో అధిక సంఖ్యలో థియేటర్ లలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుండే భారీ డిమాండ్ సొంతం చేసుకున్న ‘మజ్ను’ హిందీ రైట్స్ కి కూడా మంచి రేటు దక్కించుకుందని సమాచారం.
బాహుబలి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లతో రొమాన్స్ చేయనున్నాడు.అనూ ఇమ్మన్యువెల్, ప్రియాశ్రీ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
యూత్, ఫ్యామిలీ అని కాకుండా అన్ని తరాల వారిని అలరించేలా ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన మజ్నుతో నాని అకౌంట్ లో మరో సూపర్ హిట్ పడ్డట్టే అనిపిస్తుంది.