న్యాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ అంటే సుందరానికీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
సినిమా కాన్సెప్ట్ బాగున్నా ఎందుకో అంటే సుందరానికీ సినిమా ఆడియన్స్ కి ఎక్కలేదు.అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి మరో ఛాన్స్ రావడం చాలా కష్టం అలాంటిది తనకు ఆశించిన స్థాయిలో సినిమా ఇవ్వకపోయినా సరే మళ్లీ అంటే సుందరానికీ కాంబో రిపీట్ చేస్తున్నాడట హీరో నాని.
ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్న నాని ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
ఆ సినిమా తర్వాత హిట్ 3 చేస్తున్నాడు.
దానితో పాటుగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట.మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ప్రతిభ చాటిన వివేక్ ఆత్రేయ నానితో మరో అటెంప్ట్ కు సిద్ధమయ్యాడు.
తప్పకుండా ఈసారి ఈ కాంబో ఓ సూపర్ హిట్ సినిమా అందిస్తుందని ఆశించవచ్చు.దసరాతో నాని రేంజ్ మారబోతుందని అర్ధమవుతుంది.
మరి వివేక్ ఆత్రేయ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.