టాలీవుడ్లో కంటెంట్తో సత్తా చాటిన సినిమాల్లో ఇటీవల రిలీజ్ అయిన హిట్ చిత్రం కూడా ఒకటి.శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేశాడు.ఇక ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్లో ప్రమోషన్స్ చేయడంతో హిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా సాధించిన సక్సెస్తో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ అప్పుడే తేల్చేసింది.దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే విశ్వక్ సేన్ ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.కాగా ఈ సినిమా షూటింగ్ను లాక్డౌన్ పూర్తిగా ముగియగానే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉందని ఆయన వెల్లడించాడు.
ఈ సినిమా సీక్వెల్ను నాని ప్రొడ్యూస్ చేయడం లేదట.అయితే నాని ఈ సినిమా సీక్వెల్ను ఎందుకు ప్రొడ్యూస్ చేయడం లేదని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏదేమైనా నాని ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేయకున్నా సినిమాలోని కంటెంట్ ఖచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.