ప్రస్తుతం న్యాచులర్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ రాబోతుంది.
ఈ సినిమా ఏప్రిల్ 23 నే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో నాని ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను జులై లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారని టాక్.చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.అధికారిక ప్రకటన వస్తే కానీ నిజం తెలియదు.ఇది ఇలా ఉంటె నాని ఈ సినిమా తరువాత రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ‘ సినిమా చేస్తున్నాడు.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేశారు.‘అంటే సుందరానికీ’ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ రెండు సినిమాలను నాని ఏకకాలంలో పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు.