న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
విడుదలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా థియేటర్స్ ఇష్యు వల్ల ఓటిటీ లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారని టాక్ వచ్చింది.
అయితే మళ్ళీ పరిస్థితులు చక్కబడు తుండడంతో మళ్ళీ మేకర్స్ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని మళ్ళీ వార్తలు వినిపించాయి.థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో విడుదల అయినా సినిమాలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఓటిటి లో కాకుండా థియేటర్స్ లోనే ఈ సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుందని వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాపై తుది క్లారిటీ వాచినట్టు తెలుస్తుంది.ఏది ఎలా ఉన్న ఈ సినిమా ఓటిటీ లోనే విడుదల అవ్వబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాను త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని మరో కొద్దీ రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని నాని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
మరి త్వరలోనే ఫైనల్ క్లారిటీ ఇచ్చేస్తే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉంటారు.ఇది ఇలా ఉంటే.నాని ఈ సినిమా తరువాత రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ సినిమా చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.‘అంటే సుందరానికీ’ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది.