ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఈ అమ్మడు మొదటి సినిమా రిలీజ్ కాకుండానే తెలుగు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇప్పటికే కన్నడ, తమిళ భాషలలో సినిమాలు చేసిన ఈ అమ్మడుకి ఉప్పెన మొదటి తెలుగు సినిమా, సుకుమార్ కథతో అతని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది.ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.అయితే వైష్ణవ్, కీర్తి శెట్టి నటించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.
అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన వాయిదా పడుతూ వస్తుంది.థియేటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉప్పెన రిలీజ్ కాకుండానే ఇందులో నటిస్తున్న హీరో, హీరోయిన్స్ రెండో సినిమాలకి రెడీ అవుతున్నారు.వైష్ణవ్ తేజ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఇప్పుడు కృతి శెట్టి తన రెండో తెలుగు సినిమాకి కమిట్ అయ్యింది.రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా పీరియాడికల్ డ్రామాతో శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాలో నానికి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు.అందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే సాయి పల్లవిని ఎంపిక చేశారు.
ఇక మరో హీరోయిన్ గా రష్మికని సంప్రదించిగా డేట్స్ దొరకకపోవడంతో ఆగిపోయారు.ఇప్పుడు మరో హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫర్మ్ చేశారు.
త్వరలో దీనికి సంబందించిన విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవకాశం రావడం ద్వారా కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి.