టాలీవుడ్లో ఎవరైనా కొత్తగా ఓ సినిమాలో నటించి, ఆ సినిమా హిట్ అయితే, వారికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతుండటం మనం చూశాం.కానీ ఈ మధ్యకాలంలో కొత్తవారు తమ తొలి సినిమాలో నటిస్తుండగానే, వరుసబెట్టి ఆఫర్లు వచ్చి వారి ముందు వాలుతున్నాయి.
తాజాగా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఓ బాలీవుడ్ భామకు కూడా ఇలాగే వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.దీంతో ఆమెను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రం మాస్ రాజా రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేసింది.ఖిలాడిచిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమా కూడా రిలీజ్ కాకముందే మరో సూపర్ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.నేచురల్ స్టార్ నిర్మాతగా చేసినహిట్చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నాని నటించనున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా తెలుగులో నటించిన రెండు సినిమాలు కూడా రిలీజ్ కాకముందే, ఇలా మూడో సినిమా ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి లక్కీ గాళ్ అంటున్నారు తెలుగు సినీ విశ్లేషకులు.ఇక రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రంలో మీనాక్షి చౌదరితో పాటు డింపుల్ హయతి హరో హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.మరి మీనాక్షి చౌదరి నటించిన చిత్రాలు ఆమెకు ఎలాంటి గుర్తింపును తెస్తాయో చూడాలి.