టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో ఉండే ముద్దుగుమ్మ సాయి పల్లవి.స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకి అయినా, కమర్షియల్ పాత్రలకు ఈమె నో చెబుతూ ఉన్నా కూడా స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్స్ ఈమెనే కావాలని కోరుకుంటున్నారు.టాలీవుడ్లో ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు.తెలుగులో ప్రస్తుతం ఈమె విరాట పర్వం చిత్రంతో పాటు నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తోంది.తాజాగా మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యింది.
నాని హీరోగా రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో రూపొందబోతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా ఎంపిక అయ్యిందట.
నానితో ఇప్పటికే ఒక చిత్రంలో నటించిన సాయి పల్లవి ఈసారి మరింత కీలకమైన పాత్రలో శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంను దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.
విభిన్నమైన కథను తయారు చేసిన దర్శకుడు ఈ ఏడాది చివర్లో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కరోనా వైరస్ లేకుండా ఉంటే ఇప్పటి వరకు సినిమా ప్రారంభం అయ్యేది సగం వరకు పూర్తి అయ్యేదేమో.వచ్చే ఏడాది సినిమాను కూడా విడుదల చేసేవాడు.కాని ఇప్పుడు సినిమా వచ్చేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు చివరి దశలో ఉన్నాయి.సాయి పల్లవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసుకుని నానితో మళ్లీ జత కట్టబోతుంది.