జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం దేశంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇక సెలబ్రిటీలు కూడా కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడపడానికి ఉపయోగించుకుంటున్నారు.
ఎవరికి వారు కుటుంబంతో కాలక్షేపం చేస్తూ వారి అనుభవాలని పేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
అయితే కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని తన ఇంటి చుట్టూ పక్కల వాతావరణం ఎలా ఉందో గమనించే పని పెట్టుకున్నాడు.అందులో భాగంగా తాను కొత్త విషయం తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇంట్లో ఉండటం వలన ఇన్ని రోజులు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయని నాని తెలిపాడు.జనతా కర్ఫ్యూ కారణంగా ఇంట్లోని, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించిన అయన తన ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలో ఓ పక్షి గూడు ఉందని, ఆ గూడులో ఓ పక్షి నివసిస్తుంది చెబుతూ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఊరంతా సైలెంట్ గా ఉంది.ఇన్ని రోజులు కాలుష్యం, శబ్దాల వలన తెలియని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.మన ఇంట్లో, మన బాల్కనీలో అంటూ చుట్టూ సైలెంట్ గా ఉన్న పరిసరాలతో పాటు, తన ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలో ఉన్న పక్షి గూడును నేచురల్ స్టార్ఈ వీడియో తీసి పోస్ట్ చేశాడు.మొత్తానికి హీరోలు ఇంటి పట్టున ఉంటే సామాన్యుల మాదిరి మారిపోతారని నానిని చూస్తే అర్ధమవుతుంది.