నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ మరికొన్ని గంటల్లో ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది.ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నాడనే వార్తతో ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాను తొలుత థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్, చివరకు ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మక్కువ చూపింది.దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉన్నాయని, ఈ సినిమా కథ ఇదేనంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయని తెలుసుకున్న నాని, దానిపై స్పందించాడు.
ఇదొక ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దామని, ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా కథ ఉంటుందని ఆయన అన్నాడు.ఇందులో ట్విస్టులు మామూలుగానే ఉంటాయని, వాటిపై అతిగా అంచనాలు పెట్టుకోవద్దంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు.
దీంతో నాని ‘వి’చిత్రంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టాడు.ఇక సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమా సెప్టెంబర్ 5న ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో చూడాలి.