నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ కి మంచి టాక్ వచ్చింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ ను సాధించింది.అయితే సినిమా చిత్రీకరణ సమయంలో హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామంటూ అంతా ప్రకటించారు.
కాని ఈ సినిమా ను అక్కడ విడుదల చేయలేదు.హిందీ లో ఈ సినిమాను విడుదల చేయక పోవడంకు కారణం ఏంటీ అనే విషయం లో క్లారిటీ లేదు.
శ్యామ్ సింగ రాయ్ డబ్బింగ్ రైట్స్ ను ఒక ప్రముఖ హిందీ నిర్మాత తీసుకున్నాడు.కాని ఎందుకు ఆయన విడుదల చేయలేదు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్యామ్ సింగ రాయ్ విడుదల అయ్యి ఉంటే మంచి వసూళ్లు రాబట్టేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప సినిమా పాతిక కోట్లు కూడా రాబట్టేది అనుమానం అనుకుంటే ఏకంగా 80 కోట్లు వసూళ్లు చేసింది.
ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ ని విడుదల చేయక పోవడం తప్పు అన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయమై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.కాని నానికి మంచి సినిమా బాలీవుడ్ లో మిస్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి.ఈ విషయంలో నాని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాని శ్యామ్ సింగ రాయ్ లో సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు నటించారు.ఇద్దరు కూడా పోటీ పడి మరీ నటించినట్లుగా అనిపించింది.
ముఖ్యంగా సాయి పల్లవి నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే అనడంలో సందేహం లేదు.