నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్.ఈ సినిమా మొదలు అయినప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎందుకంటే నాని కెరీర్ లో ఇప్పటి వరకు 25 నుండి 30 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే సినిమాలు రూపొందాయి.కాని మొదటి సారి ఈ సినిమాకు భారీగా ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో అప్పట్లో చర్చ జరిగింది.
దాదాపుగా 50 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు పాటలు వచ్చాయి.
ఇప్పుడు సినిమా నుండి టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ మరో లెవల్ లో ఉంది.
నాని చెప్పిన బెంగాలీ డైలాగ్ స్త్రీ ఎవరికి దాసి కాదుచివరకు ఆ దేవుడికి కూడా అంటూ చెప్పిన డైలాగ్ తో సినిమా పై క్లారిటీ వచ్చేసింది.ఇందులో ఏ రేంజ్ లో నాని హీరోయిజం చూపిస్తాడో కూడా టీజర్ లో కనిపిస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా లో మొదటి నుండి నాని ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు అదే విషయం నిజం అయ్యింది.నాని వింటేజ్ లుక్ మరియు ఈ తరం లుక్ లో కనిపించబోతున్నాడు.నాని రెండు జన్మల్లో కూడా మీడియాకు చెందిన వ్యక్తి గా కనిపించబోతున్నట్లుగా టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
చిత్రం లో సాయి పల్లవి పాత్ర అద్బుతంగా ఉండబోతుందని టీజర్ చూస్తే మళ్లీ ఒక సారి అనిపిస్తుంది.
సినిమా చిత్రీకరణ మొదలు పెట్టింది మొదలు సాయి పల్లవి పాత్ర గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు.ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో మంచి పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.టీజర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా అనిపిస్తుంది.
చివర్లో నానికి కృతి శెట్టి లిప్ లాక్ చేయడం మరింత ఆసక్తిగా ఉంది.పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.