ఒకప్పుడు హీరోలు కేవలం సినిమాలలో నటనకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్లు.మారుతున్న కాలానికి అనుగుణంగా హీరోలు నిర్మాతలుగా మారడంతో పాటు వ్యాపారాలపై కూడా దృష్టి పెడుతున్నారు.
మిడిల్ రేంజ్ హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.హిట్ అనే సినిమాను నిర్మించి ఆ సినిమాతో హిట్ సాధించిన నాని ప్రస్తుతం హిట్ సినిమాకు సీక్వెల్ గా హిట్ 2 అనే సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే హిట్ మూవీలో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 సినిమాలో మాత్రం నటనతో వరుస విజయాలనుసొంతం చేసుకుంటున్న అడివి శేష్ నటిస్తున్నారు.నాని హిట్ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చేసిన ఆలోచన వల్లే ఈ సినిమాను అడివి శేష్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవైపు హీరోగా సత్తా చాటుతూనే మరోవైపు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా గుర్తింపును సంపాదించుకోవడానికి నాని ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ అనే సినిమాలో అడివి శేష్ నటిస్తున్నారు.మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
మేజర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న అడివి శేష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుంది.
మేజర్ సినిమా తరువాత విడుదలయ్యే హిట్ 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నా పాన్ ఇండియా మూవీ కావడంతో శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
సినిమాకు 4 కోట్ల రూపాయలు అడివి శేష్ రెమ్యునరేషన్ గా తీసుకుంటుండగా నాని ఈ పాన్ ఇండియా సినిమాతో భారీగా లాభాలు సొంతమవుతాయని భావిస్తున్నారు.