టాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాగా వి ఉండబోతుంది.ఈ నెల 5న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది.
నేచురల్ స్టార్ నాని నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై హైప్ భారీగానే ఉంది.సుధీర్ బాబు, నాని లీడ్ రోల్స్ లో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు ఇంద్రగంటి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆవిష్కరించారు.
అయితే సినిమా చూసేంత వరకు ఇందులో ట్విస్ట్స్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు.ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి చిత్ర విశేషాలని మీడియాతో పంచుకున్నారు.
సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు వేచి చూసిన ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఓటీటీకి రావాల్సి వచ్చిందని తెలిపారు.
థియేటర్ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ ఓటీటీలో కొంత తక్కువగానే ఉంటుంది.
కానీ ఓటీటీ ద్వారా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ అవుతుందనే సంతోషం ఉందని తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉందని.
సినిమా క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీస్తారా అన్న సందేహం కలుగుతుంది.ప్రస్తుతానికి సీక్వెల్ గురించి ఆలోచించలేదు.
అయితే సినిమాకి వచ్చే రెస్పాన్స్ బట్టి సీక్వెల్ ప్లాన్ ఉంటుందని ఇంద్రగంటి తెలియజేశారు.ఏది ఏమైనా వి మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా ఒక్క దిల్ రాజు తప్ప మిగిలిన టీమ్ మొత్తం కాస్తా అసంతృప్తిగానే ఉన్నారని అనిపిస్తుంది.
మరి మొదటి సారిగా పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్న నాని ఈ సినిమాలో ఎంత వరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.