న్యాచులర్ స్టార్ నాని ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో శ్యామ్ సింగ రాయ్ సినిమాఒకటి.రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇక ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, యాక్షన్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.ఇక ఈ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ రోజు టీజర్ విడుదల చేసిన సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ ప్రెస్ మీట్ లో నాని ఈ సినిమా రిలీజ్ డేట్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తెలిపాడు.ఇంతకు ముందు నాని నటించిన ఎంసిఎ సినిమా ఇలాగె క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ సినిమా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు నాని.
నాని మాట్లాడుతూ ఎంసిఎ సినిమా లాగానే శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపాడు.
అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ కూడా సాయి పల్లవి కావడంతో ఈ రెండు సెంటిమెంట్స్ కూడా నాని బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది.మరి నాని ఎంసిఎ సినిమా లాగానే ఈ సినిమా కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.