నేచురల్ స్టార్ నాని నటించే చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి.వరుసగా నాని చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో అవి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా మారుతున్నాయి.
ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న ‘వి’ చిత్రం రిలీజ్కు రెడీ అయ్యింది.ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇక నాని నటించిన ఓ సినిమా ఏకంగా 5 సంవత్సరాల తరువాత టీవీలో ప్రసారం కానుంది.
తమిళ నటుడు కమ్ డైరెక్టర్ సముథ్రికని డైరెక్ట్ చేసిన ‘జెండా పై కపిరాజు’ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా 2015లో రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది.
నాని డ్యుయెల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాను ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ చేయలేదు.కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడవ్వడంతో, ఇప్పుడు ఈ సినిమాను ‘స్టార్ మా’లో టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.మొత్తానికి నాని నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా టీవీలో టెలికాస్ట్ అయ్యేందుకు ఇన్నేళ్లు పట్టడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు.మరి టీవీ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.