న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
అప్పటి నుండి ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా థియేటర్స్ ఇష్యు వల్ల ఓటిటీ లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారని టాక్ వచ్చింది.అయితే మళ్ళీ పరిస్థితులు చక్కబడు తుండడంతో మళ్ళీ మేకర్స్ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటిటి డీల్ క్లోజ్ అయ్యిందని టాక్.
అయితే థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో విడుదల అయినా సినిమాలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఓటిటి డీల్ క్యాన్సిల్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందని వార్తలు వస్తున్నాయి.
కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఇందులో నిజమెంతో తేలదు.అందుకే నాని అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
ఇది ఇలా ఉంటే.నాని ఈ సినిమా తరువాత రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ‘ సినిమా చేస్తున్నాడు.శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేశారు.‘అంటే సుందరానికీ’ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది.