యంగ్ హీరో నాని టక్ జగదీష్ ను వచ్చే నెల 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తలు మరియు విశేషాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ సినిమా ఓటీటీ లో రావడం వల్ల థియేటర్ల వారు మాత్రం నాని పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాని తన గత సినిమా వి ను కూడా థియేటర్ ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా తీసుకు వచ్చాడు.
ఇప్పుడు టక్ జగదీష్ ను కూడా ఓటీటీ కి ఇచ్చాడు.థియేటర్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడం అనేది సినిమా థియేటర్ల ను నాశనం చేయడం అంటూ నానిని ఇటీవల థియేటర్ల సంఘం నాయకులు విమర్శించారు.
ఆ తర్వాత నానికి క్షమాపణలు చెప్పారు అది వేరే విషయం.
ఇక్కడ చర్చనీయాంశం ఏంటీ అంటే నితిన్ గత చిత్రాలు థియేటర్లలో వచ్చాయి.కాని మాస్ట్రో సినిమా ను మాత్రం ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.హాట్ స్టార్ లో ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది.
సెప్టెంబర్ 9 వ తారీకున ఈ సినిమా ను విడుదల చేస్తామని అంటున్నారు.కాని ఇప్పటి వరకు నితిన్ సినిమా ఓటీటీ విడుదల గురించి థియేటర్ల వారు స్పందించలేదు.
అసలు నితిన్ సినిమా గురించి కనీసం మాట్లాడటం లేదు.నితిన్ విషయంలో ఎందుకు పక్షపాతం వహిస్తున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మీడియాలో రెండు సినిమా ల గురించి ఓటీటీ విడుదల గురించి సమాన వార్తలు వస్తున్నాయి.కాని థియేటర్ల వారు మాత్రం నానిని మాత్రమే టార్గెట్ చేశారు అంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.