నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ సినిమా షూటింగ్ ముగిసి చాలా కాలం అయ్యింది.గత ఏడాది విడుదల చేయాలనుకున్న సమయంకు కరోనా వచ్చింది.
సరే ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ అంటూ మొదలు అయ్యింది.కరోనా సెకండ్ వేవ్ వల్ల నిలిచి పోయిన జగదీష్ మళ్లీ ఎప్పుడు వచ్చేది స్పష్టత లేకుండా పోయింది.
మొన్నటి వరకు ఓటీటీ వైపు జగదీష్ చూస్తున్నాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను థియేటర్ల ద్వారానే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను మరీ ఆలస్యం చేకూడదు అనే ఉద్దేశ్యంతో ఆగస్టులో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు మూడవ శుక్రవారంలో టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యం అంటున్నారు.తిమ్మరుసు ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లిన నాని అక్కడ మాట్లాడుతూ థియేటర్ల విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
బార్ లు పబ్ లు రెస్టారెంట్ లతో పోల్చితే థియేటర్లు చాలా సేఫ్.కాని అన్నింటి తర్వాత మాత్రమే థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సరే ఇప్పుడు నేను నా సినిమా విడుదల ఉంది కనుక మాట్లాడుతున్నాను అంటూ అంతా అనుకుంటారు.కాని నేను ఒక సినీ అభిమానిగా ప్రేక్షకుడిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
టక్ జగదీష్ కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగించినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు సినిమా నుండి అప్ డేట్ రావడం ఆగస్టు లో సినిమా ఉంటుందని నమ్మకం కలగడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు.నాని శ్యామ్ సింగరాయ్ కూడా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్నారు.