వైద్యుల నిర్లక్ష్యం. మహిళ కడుపులో గుడ్డముక్క పెట్టి కుట్టేశారు.! శస్త్రచికిత్స సమయంలో పొరపాటున మహిళలకు కడుపులో గుడ్డముక్కను పెట్టి కుట్లేసి పంపించేశారు వైద్యులు.ఆ కుట్టు వద్ద చీము పట్టి సదరు మహిళ రెండు నెలలు బాధతో తల్లడిల్లిపోయింది.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది.పూర్తి వివరాల్లోకి వెళితే నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నందిని అనే మహిళకు రెండు నెలల క్రితం వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది శస్త్రచికిత్స చేసిన సమయంలో ఎప్పటికప్పుడు రక్తాన్ని శుభ్రం చేసే గుడ్డ ముక్కను లోపల పెట్టి కుట్టేసి ఆసుపత్రి నుండి పంపించేశారు.ఆ బాలింతకు రెండు నెలలుగా కుట్లు వద్ద చీము కారుతుంది నరకయాతన పడుతుంది.
మూడుసార్లు ఆసుపత్రికి వచ్చినప్పటికీ వైద్యులు మామూల ఇన్ఫెక్షన్ అని మందులు ఇచ్చి పంపించేశారు.అయినప్పటికీ తగ్గలేదు దీంతో ఆమె ఆస్పత్రిలో జనరల్ సర్జన్ వద్దకు వెళ్ళింది.
ఆయన వెంటనే స్కానింగ్ రాసి ఇచ్చారు చివరికి స్కానింగ్ అసలు విషయం బయటపడింది.ఆమె కడుపులో గుడ్డముక్క ఉన్నట్లు గుర్తించారు.
కడుపులో గుడ్డముక్క ఉందనే విషయాన్ని సదరు వైద్యులు ఆమెకు చెప్పకుండా గైనిక్ వైద్యులకు తెలిపారు.ఈ విషయాన్ని బయటకు రానీయకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.
కుట్లు వద్ద కోత పెట్టే రెండించుల మేర ఉన్న గుడ్డ ముక్కను తొలగించారు.ఏమీ కాదని వారాల్లో తగ్గిపోతుంది అని చెప్పి పంపేశారు.