టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరైన దిల్ రాజు పుట్టినరోజు నేడు.డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు తర్వాతి కాలంలో నిర్మాతగా మారి కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.
పుట్టినరోజు సందర్భంగా నిన్న దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇవ్వగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ పార్టీకి హాజరయ్యారు.స్టార్ హీరోయిన్లతో పాటు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా పార్టీలో సందడి చేశారు.
అయితే నందమూరి కుటుంబం నుంచి మాత్రం ఈ పార్టీకి ఎవరూ హాజరు కాలేదు.వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ దిల్ రాజు మధ్య మంచి అనుబంధం ఉంది.ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడంతో పాటు బృందావనం, రామయ్యా వస్తావయ్యా సినిమాలను నిర్మించారు.భవిష్యత్తులో దిల్ రాజు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ పార్టీకి హాజరు కాలేదు.అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పార్టీకి ఆహ్వానం అందిందని అయితే బాలకృష్ణకు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.బాలయ్యకు ఆహ్వానం అందకపోవడం వల్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పార్టీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ కారణం వల్లే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదో లేక మరేదైనా కారణం ఉందో తెలియాల్సి ఉంది.
నిన్న జరిగిన పార్టీలో రెండో భార్య తేజస్వినిని దిల్ రాజు సెలబ్రిటీలందరికీ పరిచయం చేశారని సమాచారం.ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతోంది.