2012 లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ తో వెండితెరకు పరిచయమైంది నందిత.తొలిచిత్రంతోనే ఆకట్టుకోని, దర్శకుడు మారుతి దృష్టిలో పడింది.
సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమకథాచిత్రమ్ తో భారి బ్లాక్బస్టర్ అందుకుంది.ఆ చిత్రంలో నందిత నటనకు మంచి మార్కులు పడ్డాయి.
దాంతో పెద్ద అవకాశాలు వస్తాయి అనుకుందట.కాని అలాంటిదేం జరగలేదు. ఆ మధ్య రెండు చిన్న తెలుగు సినిమాలు, మళయాళంలో ఒక సినిమా చేసినా, అవేవి నందితకి గుర్తింపు తీసుకురాలేదు.తన లక్కి హీరో సుధీర్ సరసన మళ్ళీ నటించి “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ” చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.
ఆ చిత్రం మోస్తారుగా ఆడటం, నిఖిల్ సరసన శంకరాభరణంలో అవకాశం రావడంతో తన దశ తిరిగిపోయినట్టే అనుకుంది నందిత.కాని శంకరాభరణం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నారా రోహిత్ తో కలిసి “సావిత్రి” అనే సినిమాతో మనముందుకి వస్తోంది నందిత.ఈ చిత్రంతో అయినా తనకి పెద్దహీరోల సరసన ఛాన్స్ వస్తుందేమో అని ఆశపడుతోంది ఈ అమ్మాయి. “శంకరాభరణం ఫ్లాప్ అయినందుకు చాలా బాధపడ్డాను.ఎందుకంటే ఆ చిత్రం మీద నాకు ఎన్నో ఆశలు ఉండేవి .పెద్ద హీరోలతో నటించాలని ప్రతి హీరోయిన్ కి ఉంటుంది .నేనూ అంతే”, అంటూ మనసులో మాట బయటపెట్టింది ఈ 21 ఏళ్ళ కుర్ర హీరోయిన్. మరి ఏప్రిల్ 1న విడుదల అవుతున్న సావిత్రి నందిత కేరీర్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి!
.