తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పటివరకూ ఈ ఢీ షో 13 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇటీవలే 13వ సీజన్ ముగిసింది.తాజాగా 14వ సీజన్ కూడా మొదలయ్యింది.
అయితే ఈ షోలో ఎప్పటిలా కాకుండా ఈసారి మల్లెమాల టీమ్ కాస్త మార్పులు చేసింది.ఈసారి షోలో నాలుగు టీమ్ లో నలుగురు టీమ్ లీడర్ లు కొత్తగా షోని ప్రారంభించారు.
ఇందులో జడ్జీలుగా మొదట హీరోయిన్ ప్రియమణి, అలాగే గణేష్ మాస్టర్ ను మాత్రమే తీసుకువచ్చారు.ఇందులో రష్మి, సుధీర్, దీపికా పిల్లి, అలాగే జడ్జ్ పూర్ణ సైతం కనిపించలేదు.
దీంతో నెటిజన్లు వీరందరూ ఎక్కడికి వెళ్లారు అంటూ కామెంట్లు చేశారు.సుధీర్, రష్మీ ఢీ షోకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.
అలాగే హీరోయిన్ పూర్ణ షూటింగ్ ల వల్ల ఢీ షో నుంచీ తప్పుకున్నట్లు తెలుస్తోంది.అయితే జడ్జి పూర్ణ స్థానంలో మరొకరిని తీసుకొచ్చింది మల్లెమాల.
మరెవరో కాదు నందితా శ్వేత.ఈసారి నందితా శ్వేతాను పూర్ణ ప్లేస్ లో జడ్జిగా తీసుకొని వచ్చారు.
నందితకు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఈ షోకు జడ్జీగా వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక పూర్ణ లాగానే నందిత కూడా వచ్చీరాగానే ప్రదీప్ తో ట్రాక్ కలిపేందుకు ట్రై చేసినట్లు తెలుస్తోంది.ఐలవ్యూ చెబుతూ సిగ్గుపడుతూ డ్యాన్సులు కూడా వేసింది.ఇది ఒక వైపు అయితే మరొక వైపు ప్రియమణి,ఆదిలు.
ప్రియమణి ఆదినీ బావ అని పిలవడం, ఆది చెప్పు ప్రియా అనడం అంత కామెడీగా ఉంటుంది.అప్పుడు ఆది మా మధ్య బ్రేకప్ అయింది అంటూ చెప్పడం.
కొత్తగా టీం కంటెస్టెంట్ గా వచ్చిన అఖిల్, రవికృష్ణలు ప్రియమణితో హగ్గులు తీసుకోవడం చూసి ఆది కుళ్ళు కున్నాడు.ఇక మొత్తానికి ఢీ షోనీ గత సీజన్ కంటే ఈ సీజన్ కొత్త వారితో కొత్తగా మొదలు పెట్టేశారు.