టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కావటం తెలిసిందే.పాదయాత్రలో నడుస్తూ ఉండగానే గుండెపోటు రావడంతో… వెంటనే పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
అయినా గాని ఆరోగ్యం విషమించటంతో నిన్న సాయంత్రం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ఈ క్రమంలో అత్యాధునిక వైద్యులు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉన్నారు.
అయితే తాజాగా బెంగళూరు వైద్యులు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త విషయాన్ని తెలియజేశారు.గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మెలేనా వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు.ఈ వ్యాధి జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది.దీనివల్ల నోరు, అన్నవాహిక పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది.దీంతో శరీరంలో రక్త స్థాయి తగ్గిపోయి బలహీనమవుతారు.అలాగే శరీరం రంగు మారడం గుండె వేగంగా కొట్టుకోవడం.
వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు.