నందమూరి తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారు.నిన్నటి కంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడినట్లు తెలుస్తోంది.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన నందమూరి రామకృష్ణ తారకరత్న ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తారకరత్న ఎక్మో చికిత్స అందించడం లేదని, స్వయంగా శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు.ప్రత్యేక వైద్యుల బృందం ఆధ్వర్యంలో ట్రీట్ మెంట్ జరుగుతోందని చెప్పారు.
అయితే ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వెల్లడించారు.చికిత్స కోసం ఎక్మో పరికరాన్ని అమర్చారని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.