వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.మార్చి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక ఘట్టం అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి చంద్రబాబు పీఠంపై కూర్చున్న సంఘటనలని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని లక్ష్మి పార్వతి ద్రుష్టి కోణం నుంచి ఈ సినిమాని ఆర్జీవి తెరకెక్కించాడు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గా చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
తాను ప్రజలకి నిజాలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేసానని ఆర్జీవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.
ఇదిలా వుంటే ఇప్పుడు ఈ సినిమాని ఎన్నికల ముందు రిలీజ్ చేయడం వలన టీడీపీ పార్టీ ప్రతిష్టకి, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బ తగిలే ప్రమాదం వుందని, అలాగే నందమూరి ఫ్యామిలీని కూడా కించపరిచే విధంగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతుంది.
ఈ నేపధ్యంలో సినిమాకి సెన్సార్ ని రిలీజ్ పర్మిషన్ లభిస్తే హై కోర్ట్ కి వెళ్లి సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని నందమూరి ఫ్యామిలీతో పాటు, చంద్రబాబు కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది.దీనికి తెరవెనుక చంద్రబాబు నందమూరి ఫ్యామిలీతో పిటీషన్ దాఖలు చేయిస్తున్నాడని తెలుస్తుంది.