ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన కోలీవుడ్ అందాల భామ నయనతార, తెలుగు బ్యూటీ అంజలి కథానాయకులు నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ కూడా ప్రారంభమయింది.
అయితే తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నటువంటి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్ర షూటింగ్ అప్ డేట్ ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నందమూరి అభిమానులకి తెలియజేశాడు.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు మరియు తొందర్లోనే రెండో షెడ్యూలు కూడా మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు.అయితే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేయనున్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బాలయ్య బాబు ఈ చిత్రంలో అగోర కూడా పాత్రలో కనిపిస్తున్నాడు.అంతేగాక రాయలసీమకు చెందినటువంటి ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
అయితే గతంలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ లో నటించినటువంటి అపూర్వ సోదరులు, పెద్దన్నయ్య అల్లరి పిడుగు సుల్తాన్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి.
దాంతో బోయపాటి శ్రీను కూడా ఈసారి అదే ఫార్ములాని ఇప్పుడు కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో బాలయ్య బాబు నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలు అవుతుండటంతో బాలకృష్ణ ఈసారి కచ్చితంగా బోయపాటి శ్రీను చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.