నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్న తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేసున్నాడు.చాలా రోజుల తర్వాత అఖండతో హిట్ రావడంతో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమా స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత తన 108 సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు.ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెడుతూ ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తూ పోతున్నాడు బాలయ్య.
ఇక తాజాగా ఈయన మరో డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలకృష్ణ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వస్తుంది.
ఆ సినిమా చిరు డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.ఆ డైరెక్టర్ ఎవరో కాదు.మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్న బాబీ బాలయ్య తో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు అని టాక్.
ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తి అయ్యాయని.బాలయ్యకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ గట్టిగ వినిపిస్తుంది.మెగాస్టార్ తో చేసే సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా తర్వాత బాబీ బాలయ్య సినిమాపై ద్రుష్టి పెట్టనున్నాడని తెలుస్తుంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతే సినిమా బాలయ్య కెరీర్ లో 109వ సినిమా కానుంది.
ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని అంటున్నారు.మరి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.