తెలుగులో ప్రస్తుతం నందమూరి నటసింహం “లెజెండ్ బాలయ్య బాబు” ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రంలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ మరియు పూర్ణ లు నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని వైరా క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మైరాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఇప్పటికే బాలయ్య బాబు అఘోరా పాత్ర కోసం కాశీలో షూటింగ్ పూర్తి చేశారు.
దీంతో ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేసేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళినట్లు సమాచారం.
ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో బాగా ఫేమస్ అయిన దండేలి అడవులలో చిత్ర యూనిట్ సభ్యులు దాదాపుగా ఐదు రోజుల పాటు షూటింగ్ జరుపుతున్నారట.ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కోసం భారీ సినిమా సెట్లను కూడా నిర్మించారట.
ఈ అడవులలో ముఖ్యంగా పలు యాక్షన్ మరియు చేంజింగ్ సంబంధిత సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఆ మధ్య నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ డైలాగుని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతేగాక ఈ చిత్రంపై అంచనాలు కూడా పెంచేసింది.మరి బాలయ్య బాబు తన అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్, రూలర్, జై సింహ, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.దీంతో ఎలాగైనా సరే బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో హిట్ కొట్టాలని బాలయ్య బాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అలాగే బోయపాటి శ్రీను కూడా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.కాగా ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.