ఈ మంత్రం 108 సార్లు చెబితే కరోనా రాదంటున్న బాల‌య్య‌!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఎంత‌లా అత‌లాకుత‌లం చేస్తుందో చూస్తేనే ఉన్నాం.గ‌త ఏడాది డిసెంబ‌రులో ప్రారంభ‌మైన క‌రోనా.

 Mla Nandamuri Balakrishna Comments In Hindupur! Mla Nandamuri Balakrishna, Hindu-TeluguStop.com

ఇప్ప‌టికీ జోరు చూపిస్తూనే ఉంది.దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌లువురు సెల‌బ్రెటీలు త‌మ‌దైన శైలిలో స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నారు.

అయితే తాజాగా నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ మంత్రం చెబితే క‌రోనా రాదంటున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.నేడు బాల‌య్య అనంత‌పురం జిల్లా హిందూపురంలో ప‌ర్య‌టించారు.

దాదాపు ఐదు నెల‌ల త‌ర్వాత బాల‌య్య త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు.దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నంద‌మూరి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అలాగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో కూడా బాల‌య్య పాలుపంచుకున్నారు.ఇందులో భాగంగా రూ.55 లక్షలు తన సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి హిందూపూర్ కొవిడ్ ఆసుపత్రికి కరోనా నియంత్రణ వైద్య పరికరాలు, మందులు, పీపీఈ కిట్స్, మాస్కులు అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.

క‌రోనా రాకుండా ఉండాలంటే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

అంతేకాకుండా.

`అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః। అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస! విష్ణో!` (ల‌లిత త్రిపుర సుంద‌రి మంత్రం) మంత్రాన్ని 108 సార్లు జ‌పిస్తే కరోనా రాద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.దీంతో ప‌లువురు క‌రోనా జాగ్ర‌త్త‌లు చెప్ప‌కుండా.

మంత్రాలు చెప్ప‌డం ఏంటంటూ త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube