నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు వెండితెర పై అలరించిన బాలయ్య, ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదేరీతిలో తన సత్తాను కొనసాగిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు.
ఈ షో కి మొదటి గెస్ట్ గా మోహన్ బాబు ఫ్యామిలీ రాగా, అనంతరం హీరో నాని వచ్చి సందడి సందడి చేశారు.ఇటీవలే బాలయ్య భుజానికి గాయం అవడంతో ఈ షో కి కాస్త బ్రేక్ పడింది.
అయితే బాలయ్య తిరిగి కోలుకొవడంతో మళ్ళీ ఈ షోని ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఇక మూడవ ఎపిసోడ్ కి బ్రహ్మానందం తో పాటు అనిల్ రావిపూడి వచ్చారు.ఇక అనిల్ రావిపూడి, బాలయ్య, బ్రహ్మానందం ముగ్గురు కలసి సందడి సందడి చేశారు.
ఆ తరువాత ఈ షోలో బాలయ్య కాస్త అసహనానికి గురి అయినట్లు కనిపిస్తోంది.
ప్రోమోను కాస్త కాంట్రవర్సీగా చేసినట్టు ఉన్నారు.
అనిల్ రావిపూడి ఇన్ని సినిమాలు తీశారు.ఇది కూడా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఏ సినిమాలో బ్రహ్మానందానికి పాత్ర ఇవ్వలేదు.ఇక ఇదే విషయంపై బ్రహ్మానందం అనిల్ రావిపూడిని అడిగినట్లు కనిపిస్తోంది.ఈ క్రమంలోనే బాలయ్య అదుపుతప్పి ఆయన డైరెక్టర్.ఆయన ఇష్టం.స్క్రిప్టులో పాత్ర ఉంటే ఇస్తారు కదా అంటూ బ్రహ్మానందం మీద ఫైర్ అయ్యాడు.
అప్పుడు అనిల్ రావిపూడి బ్రహ్మానందానికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.మరి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.