నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అఖండ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్దంగా ఉంచాడు.మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.
నేడు ఆ సినిమా పట్టాలెక్కింది.పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా వెంటనే పెద్ద ఎత్తున మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కేవలం మూడు నెలల్లోనే సినిమాను ముగించేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
మరో వైపు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్ బీ కే అనే సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.వచ్చే ఏడాది ఆరంభంలోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కబోతుంది.
ఈ రెండు సినిమాలు కాకుండా వచ్చే ఏడాదిలో మరో రెండు సినిమాలను కూడా బాలయ్య చేస్తాడని అంటున్నారు.బాలయ్య సినిమాల విషయంలో చాలా స్పీడ్ గానే ఉంటాడు.
కాని ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .ఇదంతా కూడా చిరంజీవి వల్లే అని కూడా కొందరు కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.
బాలకృష్ణ వరుస సినిమాలతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.చాలా రోజుల తర్వాత బాలయ్యలో ఈ జోరు చూస్తున్నందుకు వారు ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నారు.వచ్చే ఏడాదిలో బాలయ్య రెండూ ముడు సినిమాలు అయినా విడుదల చేస్తాడనే నమ్మకంతో అంతా ఉన్నారు.ఇక బాలయ్య తదుపరి రాబోతున్న సినిమాలు కూడా భారీ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్న తీరు చూస్తుంటే చిరంజీవి వరుస సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.చిరంజీవి కూడా ఆచార్య సినిమాను విడుదలకు సిద్దం చేసి ఉంచాడు.మరో వైపు గాడ్ ఫాదర్.భోళా శంకర్ మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలు లైన్ లో పెట్టాడు.వచ్చే ఏడాది ఆచార్య ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.ఆ మూడు సినిమాల్లో కనీసం రెండు సినిమాలు అయినా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు అదే దారిలో బాలయ్య కూడా నడుస్తున్నాడని మెగా ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు.నిజం ఏంటో కాని అభిమానులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఆనందించే సమయం.