కోలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.ఉప్పెన సినిమా ద్వారా విలక్షణ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకాభిమానాన్ని పొందారు.
ఈ క్రమంలోనే తనకు కథ నచ్చితే అది హీరో అయిన విలన్ పాత్రలో అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పలు సందర్భాలలో చెప్పిన విజయ్ సేతుపతి తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం దర్శకుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి బాలయ్య బాబు సినిమాలో విలక్షణ పాత్రలో నటించడం కోసం విజయ్ సేతుపతి ఎంతో సున్నితంగా నో చెప్పినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే నటుడు విజయ్ సేతుపతి పై బాలయ్య బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు తమ అభిమాన హీరో సినిమాలో నటించక పోవడానికి కారణం ఏమిటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి తనతో పాటు సమాన హీరో అయినటువంటి బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఎందుకు నో చెప్పారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో చేయనున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరగడంతో ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ పాత్రలో చేయడం కోసం దర్శకుడు విజయ్ సేతుపతి సంప్రదించగా ఈ సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి కారణం చెప్పకుండా తిరస్కరించడంతో ఆయనపై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరికొందరు స్పందిస్తూ సినిమాలు చేయడానికి నో చెబితే ఈ విధంగా ట్రోల్ చేస్తారా.అంటూ తిరిగి కామెంట్ చేస్తున్నారు.