నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా NBK107.ఈయన అఖండ సినిమా తర్వాత తన 107వ సినిమాతో బిజీగా ఉన్నాడు.బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమా స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.
గోపిచంద్ మలినేని కూడా క్రాక్ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై నందమూరి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా తాజాగా బాలయ్య ఫ్యామిలీ గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ఒకే చోట కలుసు కున్నారు.
దీనికి సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
అటు షూటింగ్ తో బిజీగా ఉంటూనే ఇటు ఫ్యామిలీ తో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది.ఈ బ్యూటిఫుల్ ఫోటో అందరిని ఆకట్టు కుంటుంది.
టర్కీ లో షూట్ పూర్తి అయ్యాక గోపీచంద్ తన భార్య కొడుకుతో.అలాగే బాలయ్య తన భార్య, కొడుకు మోక్షజ్ఞ తో కలిసి బోట్ వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ పిక్ ఇప్పుడు బయటకు రావడంతో మంచి వైరల్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను సంక్రాంతి బరిలో కానీ క్రిస్మస్ బరిలో కానీ దింపే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలిచి పోతుందో లేదో.