నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పునః ప్రారంభం విషయంలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో బాలకృష్ణ ఇంకా కూడా కరోనా కు భయపడి షూటింగ్ కు దూరంగా ఉంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వచ్చే ఏడాది లో షూటింగ్ కు హాజరు అవ్వాలనే నిర్ణయానికి బాలయ్య వచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇప్పటికే సినిమా పని లో నిమగ్నం అయ్యి ఉన్నాడు అంటున్నారు.
హీరోయిన్ మరియు విలన్ ఎంపిక విషయం లో బోయపాటి తో ప్రతి రోజు చర్చలు ప్రతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటున్నారు.వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న బాలయ్య ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.
ముందే ఎక్కువ సమయం తీసుకున్నాడు అంటే కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతుంది.కరోనా భయం వల్ల చాలా మంది షూటింగ్ లకు దూరంగా అయ్యారు.గత రెండు నెలలుగా మళ్లీ షూటింగ్ లు మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ను బాలయ్య కూడా మొదలు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
కాని అనూహ్యంగా బాలకృష్ణ మాత్రం ఇంకా సినిమా షూటింగ్ విషయంలో వెనకడుగు వేస్తున్నాడు.వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సినిమాకు షూటింగ్ మొదలు పెట్టలేదు.కాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తూనే ఉన్నాయి.బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభిస్తే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.