అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డెమోక్రాట్లు అభిశంసన ప్రవేశపెట్టిన విషయం విధితమే.ఈ అభిశంసన రాజకీయ కుట్రలో భాగం అని ట్రంప్ అన్నా ప్రజల్లో మాత్రం ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని.
స్వచ్చందంగానే వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ అన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె ట్రంప్ పై అభిశంసన విషయం రోజు రోజుకి పెరుగుతోందని.
ప్రజలు కూడా అభిశంసన కి మద్దతు ఇస్తున్నారని అన్నారు.ట్రంప్ ఎంతో తెలివైన వాడని.
ఏదైనా దేశంతో అవసరం తీరిన తరువాత సైనిక సహాయం ఆపెస్తారని అన్నారు ఆమె.అయితే ఈ అభిశంసన పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని విలేఖరులు అడిగిన ప్రశ్నకి ఆమె బదులిస్తూ.
ఎంత సమయం పడుతుందనేది చెప్పలేము కానీ తప్పకుండా ట్రంప్ అమెరికా ప్రజల నుంచీ వైదొలగుతారు అని నాన్సీ తెలిపారు.గతంలో అమెరికా అధ్యక్షుడు వాటర్ గేట్ కుంభకోణంలో ఆధారాలు ఒక్కొక్కటి వచ్చినట్టుగానే ఈ సారి కూడా ఆధారాలు వస్తాయని.ట్రంప్ తప్పకుండా చట్టం ముందు నుంచీ తప్పించుకోలేరని అన్నారు నాన్సీ.